అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ ఫుల్ కావడంతో మూడో విడతపై కమలంశ్రేణులు ఫోకస్ పెట్టాయి. తాజాగా బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్  తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్చువల్ గా పాల్గొన్నారు. అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు పాదయాత్ర ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు. పాదయాత్ర మొదటి రోజైన ఆగస్ట్ 2 న యాదగిరి గుట్ట లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్య నేతలను పిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.