కొంత కాలంగా రాజకీయ నాయకులను వదలడం లేదు కరోనా వైరస్. వరుసగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. లేటెస్టుగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్కు కరోనా సోకింది. ఈవిషయం ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని… డాక్టర్ల సలహా ప్రకారం ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్ కు కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు …త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు.
I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.
— CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020