లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 11 మంది లోక్సభ అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. ఒడిశా నుండి ముగ్గురు, పంజాబ్ నుండి ఐదుగురు, పశ్చిమ బెంగాల్ నుండి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ ఇప్పటి వరకు 411 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఒడిశా బీజేపీ అభ్యర్థులు
జాజ్పూర్ (SC) : డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహెరా
కంధమాల్ : సుకాంత కుమార్ పాణిగ్రాహి
కటక్ : భర్తృహరి మహతాబ్
పంజాబ్ బీజేపీ అభ్యర్థులు
గురుదాస్పూర్ : దినేష్ సింగ్
అమృత్సర్ : తరంజిత్ సింగ్ సంధు
జలంధర్ : సుశీల్ కుమార్ రింకు
లూథియానా : రవ్నీత్ సింగ్ బిట్టు
ఫరీద్కోట్ : హన్స్ రాజ్ హన్స్ (SC)
పాటియాలా : ప్రణీత్ కౌర్
పశ్చిమ బెంగాల్ బీజేపీ అభ్యర్థులు
ఝర్గ్రామ్ (ST) : డాక్టర్ ప్రణత్ తుడు
బీర్భూమ్ : దేబాశిష్ ధర్