జహీరాబాద్​లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి : వెంకటరమణారెడ్డి

జహీరాబాద్​లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి :  వెంకటరమణారెడ్డి

కామారెడ్డి టౌన్/ బాన్సువాడ, వెలుగు: జహీరాబాద్​పార్లమెంట్​ స్థానంలో బీజేపీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్​ బీజేపీ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. 

పార్లమెంట్​ ప్రవాస్​యోజనలో భాగంగా గురువారం కామారెడ్డి, బాన్సువాడలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చినట్లే పార్లమెంట్​ఎన్నికల్లోనూ రావాలన్నారు. ఇన్​చార్జ్​బద్ధం మహిపాల్​రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్​అరుణతార, వరంగల్​జిల్లా ఇన్​చార్జ్​ మురళీధర్​గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, శ్రీనివాస్ గార్గే, దొరబాబు పాల్గొన్నారు.