కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే ఇష్యూ డైవర్ట్..

కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే ఇష్యూ డైవర్ట్..

అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల సంఘాలను చర్చకు పిలవాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగుల డిమాండ్లపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రాకారమే 7.5 శాతం ఫిట్మెంట్ ముందు పెట్టి పెండింగ్ లోని ఉద్యోగుల సమస్యలను తెరపైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేశాడన్నారు. ఆయన ప్లాన్ ప్రకారమే ఇప్పుడు త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ వైపు డైవర్ట్ అయిందన్నారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్యకమిటీ బిస్వాల్ రిపోర్ట్ పై అభిప్రాయ సేకరణకు పిలుస్తున్నారన్నారు. పాలభిషేకాలకోసం తాపాత్రయపడే సీఎం మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. పైగా ప్రభుత్వ వైఖరిపై గొంతెత్తే వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారన్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. 2014 లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు.

ఈ నెల 31 వరకు ఎర్రకోట బంద్