నేడు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం

నేడు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. కీలకమైన రాజకీయ తీర్మానాలకు రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలపనుంది. వచ్చే ఎన్నికలకు సిద్ధమౌతోన్న బీజేపీ.. గెలుపే లక్ష్యంగా రాజకీయ తీర్మానాలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని ప్రజల మధ్య చర్చ పెట్టాలని తీర్మానం చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం, ఎన్నికల హామీలపై సర్కార్ పై ఒత్తిడి తేవడం, ఉద్యమ కార్యచరణపై తీర్మానం చేసే చాన్స్ ఉంది. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, పార్లమెంట్ ప్రవాస యోజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చివరగా మునుగోడు బైపోల్ ఫలితం, భవిష్యత్ కార్యచరణపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో నాయకులు చర్చించనున్నారు. 

బీజేపీ శిక్షణా తరగతులు రెండో రోజు శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో జరిగాయి. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంతో పాటు 14 అంశాలపై చర్చించారు. దేశ నిర్మాణంలో బీజేపీ పాత్ర, మోడీ ప్రభుత్వ విధానాలు,  ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాలకు మోడీ ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చించారు. ఈ శిక్షణ శిబిరాలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అర్వింద్​, సోయం బాబూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు, మాజీ  ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.