
మెహిదీపట్నం, వెలుగు: చైనా మాంజాను బహిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడామని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అల్వాల ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆర్మీ జవాను ప్రాణాలో కోల్పోయాడని పేర్కొన్నారు.
మిలటరీ అధికారి కోటేశ్వర్ రెడ్డి డ్యూటీకి బైక్ పై వెళ్తుండగా శనివారం రాత్రి లంగర్ హౌస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై తెగిపడిన పతంగి చైనా మాంజా అతని మెడకు తగిలి కోసుకుపోయిందని, దీంతో జవాన్ చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినా దానిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే వాడుతున్నారని తెలిపారు. ఇకనైనా పోలీసులు చైనా మాంజాను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా చైనా మాంజాను వాడొద్దని కోరారు.