భారీ మెజార్టీతో గెలవబోతున్న ఈటల

భారీ మెజార్టీతో గెలవబోతున్న ఈటల

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే పొద్దటి నుంచి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు సంజయ్. వరి కావాలా.. ఉరి కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. వరి కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలన్నారు. కేసీఆర్ వడ్లు ఎట్ల కొనడో చూస్తామన్నారు. బుధవారం హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.