మా రాష్ట్రంలో రాహుల్ పర్యటించిన ప్రతిచోటా మేమే గెలుస్తం : అస్సాం సీఎం

మా రాష్ట్రంలో రాహుల్ పర్యటించిన ప్రతిచోటా మేమే గెలుస్తం : అస్సాం సీఎం

గువాహటి :  భారత్ జోడో న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అస్సాంలో కవర్ చేసిన నియోజకవర్గాలన్నింటిని బీజేపీ గెలుచుకుంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. గురువారం అస్సాంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.  ‘‘రాహుల్ పర్యటించిన ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంటుంది. అందువల్ల బీజేపీకి రాహుల్ కావాలి. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తాం”అని హిమంత తెలిపారు.

న్యాయ్ యాత్రకు అనుమతించిన మార్గం వదిలి గువాహటి సిటీలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ  రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు కేసును నమోదు చేశారు. రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలోనే అస్సాంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర చేపట్టడం మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్ర అని హిమంత ఆరోపించారు.