రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్

సీఎం కేసీఆర్  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీకి తెలంగాణలో 65 నుంచి 70 సీట్లు వస్తాయన్నారు. టీఆర్ఎస్ పది సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ‘ప్రజాగోస -బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా..11వ రోజు కామారెడ్డి జిల్లా మద్నూర్ లో మాజీ ఎమ్మెల్యే అరుణతారతో కలిసి వివేక్ వెంకటస్వామి పర్యటించారు.  

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని ప్రజలు ఫిక్స్ అయ్యారని వివేక్ వెంకటస్వామి చెప్పారు.  ఈ కార్యక్రమం సందర్భంగా బైక్ ర్యాలీలోనూ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.