దుబ్బాకలో బీజేపీ గెలుపు..టీఆర్ఎస్ పతనానికి నాంది

దుబ్బాకలో బీజేపీ గెలుపు..టీఆర్ఎస్ పతనానికి నాంది

అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రలను ఛేదించి దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ కుటుంబపాలనకు టీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నిక రుజువు చేసిందన్నారు బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

దుబ్బాకలో రఘునందన్ రావు చరిత్రాత్మక విజయం సాధించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పోలీసులతో వేధింపులకు కూడా దిగిందని విమర్శించారు.