ఆ రెండు చోట్ల విజయం బీజేపీదే: ప్రకాశ్ జవదేకర్

ఆ రెండు చోట్ల విజయం బీజేపీదే: ప్రకాశ్ జవదేకర్

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోనున్నారని, అక్కడ గెలుపు బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలు కేసీఆర్ పాలన ఇక చాలు అనుకోవడమే ఇందుకు కారణమన్నారు. ఆదివారం బీజేపీ మీడియా సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు ఒకటి, రెండు శాతం మందికి కూడా అందలేదు.

డబ్బు లేకపోవడంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయలేక పోయామని కేటీఆర్ చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు వేలాది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ ను భూమి దొంగ అని ప్రజలు తిడుతున్నారు. కాంగ్రెస్ లాంటి అపరాధిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఇన్నేండ్ల పాటు కాంగ్రెస్.. తెలంగాణ ఎందుకు ఇవ్వలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకు మోదీపై నమ్మకం ఉంది. మోదీ తరహా పాలన తెలంగాణలో కావాలని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.