
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తు సిరియస్ గా జరుగుతోంది..పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విమానం శకలాలనుంచి డీవీఆర్, బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం(జూన్14) బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. బ్లాక్ బాక్స్ డీకోడ్ అయితే ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వస్తాయి.. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తుపై పౌర విమాన యానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలు తెలిపారు.
ALSO READ | విమాన ప్రమాదం ఘటనపై విచారణ స్పీడప్.. 11 మందితో కమిటీ...
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామన్నారు పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు. కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ ను దర్యాప్తు అధికారులు డీకోడ్ చేస్తున్నారు వివరాలకోసం వేచి ఉన్నామన్నారు. శనివారం నాడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రామ్మోహన్ నాయుడు. తన తండ్రి (ఎర్రన్నాయుడు) కూడా గతంలో ప్రమాదంలో మరణించారు.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని..మృతుల కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ విమానాలను పరిశీలించాల్సిందిగా డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. దేశంలో మొత్తం 34 బోయింగ్ విమానాలు ఉండగా, ఇప్పటికే 8 విమానాలను చెక్ చేసినట్లు చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు రామ్మోహన్ నాయుడు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ టెస్టులునిర్వహిస్తున్నారు. గుజరాత్లోనే వీలైనంత త్వరగా అవి పూర్తవుతాయని చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని వదిలిపెట్టమని మరోసారి హామీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. ఈ ప్రమాదంపై తన రాజీనామాను ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం దారుణం అన్నారు. మొత్తం మీద రామ్మోహన్ నాయుడు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే, సహాయక చర్యలు, దర్యాప్తు పురోగతి, భవిష్యత్తులో భద్రతా చర్యల పెంపుదలపై దృష్టి సారించారు.