ముంబై BMC డిప్యూటీ కమిషనర్ కరోనాతో మృతి

ముంబై BMC డిప్యూటీ కమిషనర్ కరోనాతో మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబై లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. రోజు రోజుకీ మహానగరంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. లేటెస్టుగా బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. శిరీష్ దీక్షిత్ తన నివాసంలోనే మరణించారు. ఆయనలో పెద్దగా లక్షణాలేమీ కనపడకపోగా..ఈ ఉదయం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  వైద్య బృందం వచ్చే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతోనే మృతి చెందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో ప్రస్తుతం కరోనా ప్రభావం అత్యంత తీవ్రస్థాయిలో ఉంది.