బోధన్, వెలుగు : ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ‘మన ఇసుక వాహనం’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా అయ్యే ఇసుక లోడ్ల వివరాలను పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరిగా రిజిస్ట్రర్లలో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్, సాలూర తహసీల్దార్లు విఠల్, శశిభూషణ్, సాలూర ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, పట్టణ వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు.
