వెంకటాపురం, వెలుగు : తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ అడవుల్లో వర్షాలు కురుస్తుండడంతో బొగత జలపాతం ఉప్పొంగుతోంది.
ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగారు. మరికొందరు నీటిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. కాగా, జలపాతం వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాజేడు ఫారెస్ట్ ఆఫీసర్ నరేందర్ సూచించారు.
