తాడిపత్రిలో కూలీల వాహనం బోల్తా.. ఒకరు మృతి

తాడిపత్రిలో కూలీల వాహనం బోల్తా.. ఒకరు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో  రోడ్డు ప్రమాదం జరిగింది. చుక్కలూరు క్రాస్ దగ్గర కూలీలతో వెళుతున్న బొలెరో వెహికల్  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు  అక్కడిక్కడే చనిపోయారు.  పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు . ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.