
బాలీవుడు స్టార్ నటుడు, కార్తికేయ మూవీ ఫేమ్ అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగతనం జరిగింది. ఆయన ఆఫీస్ తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన దుండగులు సినిమా నెగిటివ్స్, విలువైన పత్రాలు దొంగిలించారట. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ నటుడు అనుపమ్ ఖేర్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన.. వీర దేశాయ్ రోడ్లో ఉన్న నా ఆఫీసులో గతరాత్రి దొంగలు పడ్డారు. తలుపు పగులగొట్టి లోపలికి వచ్చిన దొంగలు అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్, విలువైన పత్రాలను దొంగిలించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.. అంటూ చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.