పాలిటిక్స్ లోకి బాలీవుడ్ హీరోయిన్!

పాలిటిక్స్ లోకి బాలీవుడ్ హీరోయిన్!

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం మాములు విషయమే. చాలా మంది నటినటులు రాజకీయాల్లోకి వచ్చి తమదైన స్థాయిలో ముద్ర వేశారు. కొందరు నిలదొక్కుకోలేకపోయారు. అయితే దేశంలో మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కొంతమంది సినీ తారలు తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో కంగన రనౌత్ ముందు వరుసలో ఉంది.

బీజేపీ తరపున హిమచల్ ప్రదేశ్ మండి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి ఆమె సిద్ధమైంది. ఇక్కడ ప్రచారాన్ని కూడా ఆమె ప్రారంభించింది. చిరుత బ్యూటీ నేహాశర్మ కూడా రాజకీయారంగేట్రం చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ కరిష్మా కపూర్- కరీనా కపూర్ సైతం రాజకీయాల్లో చేరతారని కథనాలొచ్చాయి. 

శివసేన అధినేతను కపూర్ సిస్టర్స్ నేరుగా ఆయన నివాసంలో కలవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా మరోబ్యూటీ పేరు కూడా తెరపైకి వచ్చింది. 1-నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ కుడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై కృతి సనన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.