శ్రీదేవి నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)..తనదైన శైలి, అందం, విలక్షణ ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో జాన్వీ కపూర్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జాన్వీ నిరంతర ఫొటోషూట్లు, వీడియో షూట్లకు భారీగా యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉంది.
లేటెస్ట్గా జాన్వీ కపూర్ శారీలో కనిపిస్తూ షేర్ చేసిన ఓ ఫోటోషూట్..సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..కాదు కాదు..సోషల్ మీడియాను వేడెక్కించేస్తోంది. గ్లామర్ డ్రెస్ లోనే కాకుండా చీరకట్టినా కూడా గ్లామర్ డోస్ దట్టించడంలో తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.
ఈ ఫొటోలో తెలుపు మరియు నారింజ పూల చీరతో సరిపోయే ముడి బ్లౌజ్ను ధరించిన జాన్వీ అందాన్ని చూసి ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. దీంతో ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. కుర్రకారుని ఎప్పటికప్పుడు పిచ్చెక్కిపోయేలా చేసే జాన్వీకి..ఈ దునియాలో ఉన్న కుర్రాలందరూ దాసోహులే అని చెప్పడంలో సందేహం లేదు.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ (NTR) తో దేవర(Devara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే..జాన్వీ ముందు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. రీసెంట్ గా రామ్ చరణ్ RC 16 బుచ్చిబాబు సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది.
ALSO READ :- పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు చేస్తే ఈ జాబ్సే చేయాలి అబ్బా..
శ్రీదేవి నటవారసురాలైన జాన్వీని తెరపై చూసుకుని ఆనందించాలని తెలుగు ఆడియాన్స్ వెయిట్ చేస్తున్నారు. దేవరలో జాన్వీ పల్లెటూరి పడుచులా తంగం అనే పాత్రలో నటిస్తోంది.