పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికీ రష్యాలో పుష్ప ఓ ఊపు ఊపుతోంది. పుష్పలో తనదైన మేనరిజం, డైలాగ్స్ తో సౌత్ ఆడియన్స్ నే కాదు, నార్త్ ఆడియన్స్ ను కూడా అల్లు అర్జున్ మెప్పించాడు. ఈ సినిమాకు పలువురు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఫిదా అయ్యారు. అందులో ఒకరు రోహిత్ షెట్టి. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రోహిత్ షెట్టి.. అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు. బాలీవుడ్ మూవీ సర్కస్ ట్రైలర్ రిలీజ్ లో రోహిత్ శెట్టి ఈ కామెంట్స్ చేశాడు. తనకు సౌత్ హీరోలందరితో సినిమాలు తీయాలని ఉందని.. ముఖ్యంగా అజిత్ కుమార్, విజయ్, అల్లు అర్జున్, కార్తీలతో కలిసి పనిచేయడం ఇష్టమని చెప్పారు. ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ఫుల్ ఎంటర్ టైనర్ గా సర్కస్
డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటించారు. నిన్న రిలీజైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రణ్వీర్ సింగ్ గెటప్స్, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ శెట్టి మళ్ళీ తన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.