తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ బ్రేక్ దర్శనం సమయంలో జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది. 

అచ్చమైన తెలుగమ్మాయిలా లంగాఓణీలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది జాన్వీ. రంగనాయకుల మండపంలో.. వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటారు. ఆమెకు తిరుపతి బాలాజీ అంటే ఎంతో ఇష్టం. అంతే కాదు ఇప్పటికీ చాలామార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు.