Good News : జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన వెంటనే వైన్ షాపులు ఓపెన్ చేసుకోండి

Good News : జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన వెంటనే వైన్ షాపులు ఓపెన్ చేసుకోండి

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన  వెంటనే  ముంబైలో మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది   బాంబే హైకోర్టు . జూన్ 4 న రిజల్ట్  వెలువడుతున్నందున ఆ రోజు మొత్తం డ్రై డేగా నిర్ణయించారు . అయితే ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ   హోటళ్లు, రెస్టారెంట్లు, పర్మిట్ రూమ్‌లు ..  బార్‌ల యజమానుల సంఘం ( AHAR ) బాంబే హైకోర్టును ఆశ్రయించింది.  ముంబై నగరం.. సబర్బన్ కలెక్టర్లు జారీ చేసిన ఉత్తర్వులపై రెండు వేర్వేరు  పిటిషన్లు  దాఖలు చేసింది.


ముంబై నగర కలెక్టర్ , ముంబై జిల్లా సబర్బన్ కలెక్టర్‌ను సంప్రదించి జూన్ 4 రోజంతా డ్రై డేగా ప్రకటించే  నిర్ణయాన్ని సమీక్షించాలని  పిటిషనర్లు కోరారు.    మద్యం విక్రయించే సంస్థలను రోజంతా కాకుండా ఫలితాల ప్రకటన తర్వాత వ్యాపారానికి అనుమతించేలా కలెక్టర్ల ఉత్తర్వులను సవరించాలని కోరారు.  ఈ పిటిషన్లను  ఇవాళ విచారించిన   బాంబే హైకోర్టు జూన్ 4న  ఫలితాలు వచ్చిన తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చింది.