ముషీరాబాద్, వెలుగు : డాక్టర్ జి. భవానీ కృష్ణమూర్తి రాసిన ‘శ్రీ లలిత సహస్రం భవానీ పంచ పదుల మణిహారం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగింది. కాలేజ్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ ఆధ్యాత్మిక విభాగం, శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగింది.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త డాక్టర్ అనంతలక్ష్మి, నిట్టల కిరణ్మయి, వీఎస్ జనార్ధనమూర్తి, శారదా దీక్షితులు, బాలసుబ్రమణ్య శర్మ, పాండురంగ విఠల్, ననుమాస స్వామి, సుధ, రాధ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.