బుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ రద్దు

 బుక్ మై షోపై కేసు నమోదు.. సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ రద్దు

సన్ బర్న్ హైదరాబాద్ ఈవెంట్ టికెట్ విక్రయాలను బుక్ మై షో  నిలిపివేసింది.  అనుమతి ఇవ్వకుండా టికెట్లు విక్రయిస్తున్నందుకు బుక్ మై షోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుక్ మై షో వెనక్కి తగ్గింది. ఇప్పటికే బుక్ మై షో, సన్ బర్న్ నిర్వహకులకు  పోలీసులు నోటీసులు జారీ చేశారు. Yolo arena లో బుక్ చేసుకున్న సన్ బర్న్ షో హైదరాబాద్  ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు.

సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఆదివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో  సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ పై స్ట్రిక్ట్ గా ఉండాలని  సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.  నగరంలో సన్ బర్న్ లాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై పోలీసులు  ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు..  ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఈసారి న్యూ ఇయర్ కి సన్ బర్న్ కి  ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు. అనుమతి తీసుకోకుండా.. ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని.. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు తెలిపారు.