
పద్మారావునగర్, వెలుగు: బోరబండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు లేకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్కు ఫ్లష్ ట్యాంకులు, నీటి వసతి లేకపోవడంతో అవి అధ్వాన్నంగా తయారయ్యాయి. పక్క స్కూల్లోని టాయిలెట్లను స్టూడెంట్స్ వినియోగిస్తున్నారు. తాగునీటి కొరత, పారిశుధ్య సమస్య నెలకొంది. దీంతో మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.