మోడీ, వెంటిలేటర్లు ఈ రెండు పనిచేయట్లేదు

మోడీ, వెంటిలేటర్లు ఈ రెండు పనిచేయట్లేదు

కరోనాను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి ప్రధాని మోడీపై కొద్ది రోజులుగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. లేటెస్టుగా.. వెంటిలేటర్స్‌ వివాదంపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, వెంటిలేటర్లు సేమ్‌ టు సేమ్‌ అని.. అవసరమైనప్పుడు రెండు పనిచేయడం లేదంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పీఎం కేర్స్‌ నుండి కొనుగోలు చేసిన వెంటిలేటర్లు.. ప్రధానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.

పీఎంకేర్స్ తో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటిలేటర్లు పంజాబ్‌లోని ఫరీద్‌ కోట్‌లోని గురు గోవింద్‌ మెడికల్‌ కాలేజ్‌, ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేశారు.టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా అవి పనిచేయడం లేదన్న నివేదికలపై స్పందించారు రాహుల్ గాందీ. మోడీ, వెంటిలేటర్లు ఈ రెండు అవసరమైన సమాయాల్లో పని చేస్తాయని  అనుకోవడం వృథా అంటూ ట్వీట్ చేశారు.