బోయిన్ పల్లి మార్కెట్ పై ప్రశంసలు కురిపించిన మోడీ

బోయిన్ పల్లి మార్కెట్ పై ప్రశంసలు కురిపించిన మోడీ

హైదరాబాద్ లోని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ సందర్భంగా మాట్లాడిన మోడీ.. మార్కెట్లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడాన్ని మెచ్చుకున్నారు. మార్కెట్లో ప్రతి రోజు 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్ , 30 కేజీల బయోఫ్యూయల్ ను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ విద్యుత్ ను మార్కెట్ లో విద్యుత్ దీపాలు వెలిగించడానికి వాడుతున్నారన్నారు.  చెత్తను బంగారంగా మార్చేటు వంటి ఈ గొప్ప  ప్రక్రియ చాలా మందికి ఆదర్శనీయమన్నారు మోడీ.

see more news

ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం