హైదరాబాద్ లోని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ సందర్భంగా మాట్లాడిన మోడీ.. మార్కెట్లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడాన్ని మెచ్చుకున్నారు. మార్కెట్లో ప్రతి రోజు 10 టన్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్ , 30 కేజీల బయోఫ్యూయల్ ను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ విద్యుత్ ను మార్కెట్ లో విద్యుత్ దీపాలు వెలిగించడానికి వాడుతున్నారన్నారు. చెత్తను బంగారంగా మార్చేటు వంటి ఈ గొప్ప ప్రక్రియ చాలా మందికి ఆదర్శనీయమన్నారు మోడీ.
see more news
ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం
At Bowenpally Sabzi Mandi, waste is now being turned into wealth. This is the journey of turning garbage into gold. From there almost 10 tonnes of waste is collected in a plant every day. Also, 500 units of electricity is produced daily apart from about 30 kg biofuel: PM Modi https://t.co/9u0qG1JGyE
— ANI (@ANI) January 31, 2021