ఇంట్లో ఉయ్యాలే ఉరితాడైంది.. మెడకు బిగుసుకుపోయి చనిపోయిన బాలుడు

ఇంట్లో ఉయ్యాలే ఉరితాడైంది.. మెడకు బిగుసుకుపోయి చనిపోయిన బాలుడు

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా భీమిని మండలం రాజారం గ్రామంలో ఓ బాలుడు ఉయ్యాల ఊగుతుండగా అది ఉరితాడై ప్రాణాలు తీసింది. పోలీ సుల కథనం ప్రకారం..దుర్గం గణపతి, సునీత దంపతుల కొడుకు అక్షిత్(13) మండలంలోని ఓ స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం స్కూల్​కు సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అక్షిత్ ఇంట్లో దూలానికి కట్టిన చీరతో ఉయ్యాల ఊగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ అది మెడకు బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన చుట్టుపక్కలవారు తల్లిదండ్రులకు సమాచారమిచ్చి, మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్  తెలిపారు.