గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో గుండెపోటుతో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన సంతోష్, శివకుమారి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అభయ్ (14), ఆయూష్ ఉండగా, ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. మైలార్దేవ్పల్లిలోని బాబుల్రెడ్డినగర్లో నివాసం ఉంటూ దంపతులిద్దరూ కూలీ పని చేసుకుంటున్నారు. అభయ్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం అభయ్ ఇంట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. కుటుంబసభ్యులు హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
