వడదెబ్బతో బాలుడు  మృతి

వడదెబ్బతో బాలుడు  మృతి

పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో   వడ దెబ్బతో ఓ బాలుడు చనిపోయాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక రేణుక, శోభన్​ బాబు దంపతుల కొడుకు విక్రమ్​ (12 ) జనగామ జిల్లా లోని సోషల్​ వెల్ఫేర్​ స్కూల్​లో  7వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాలకుర్తిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని  సాయంత్రం ఇంటికి వచ్చాడు.  తర్వాత వాంతులు,  మోషన్స్​ కావడంతో  అతడి పేరెంట్స్​ స్థానిక  ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్​ ఎంజీఎం తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఆదివారం ఉదయం చనిపోయాడు.