బీహార్ లోని నలంద జిల్లా కులూ గ్రామంలో ఇవాళ ( జులై 23) ఆడుకుంటూ బోరు బావిలో పడిన మూడేళ్ల వయస్సు బాలుడిని రెస్క్యూ అధికారులు కాపాడారు.40 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 గంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం బాలుడిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్ ను అధికారులు,ప్రజలు అభినందించారు.
#WATCH Bihar: Rescue operation underway by NDRF team after a child fell into a borewell in Kul village in Nalanda. https://t.co/HdcCri8c7O pic.twitter.com/K4rB1OyjRB
— ANI (@ANI) July 23, 2023
బీహార్ లోని నలంద జిల్లా కులూ గ్రామంలో శుభ్మన్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు,NDRF బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావిలోకి కెమెరాను పంపించి ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు. బాలుడు బోరుబావి అడుగున నీళ్లలో ఏడుస్తూ ఉన్న దృశ్యాలను కుటుంబసభ్యులకు చూపించారు. జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని రక్షించారు.
#WATCH | Bihar: The child who fell into a borewell in Kul village in Nalanda has been rescued. More details are awaited. https://t.co/G6FW8RDIJJ pic.twitter.com/KQouMHkffD
— ANI (@ANI) July 23, 2023