చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు

చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు
  • చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు
  • బ్రెయిన్​డెడ్​ అయిన యువకుడి గుండె, కిడ్నీలు దానం 

యాదాద్రి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబీకులు దానం చేశారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన నల్ల పరమేశం(32) లారీ ఢీకొనడంతో ఈ నెల 3న తీవ్రంగా గాయపడ్డాడు. ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్ మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. రూ. 6 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. పరమేశం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనికి భార్య, కొడుకు ఉన్నారు. జీవన్ దాన్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్లు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో అవయవదానం చేసేందుకు అంగీకరించారు. పరమేశం గుండె, కిడ్నీలు సేకరించారు. మలక్ పేట యశోద ఆస్పత్రి నుంచి నిమ్స్ వరకు శనివారం గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్​లో గుండెను తరలించారు. నిమ్స్ లో మరో వ్యక్తికి అమర్చారు. పరమేశం కుటుంబానికి మోత్కూర్ జడ్పీటీసీ గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.