హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలవివాదాలు పరిష్కరించేందుకు ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని ఏడాది పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తి మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 30తో ట్రిబ్యునల్ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జులై 30వ తేదీలోగా రెండు రాష్ట్రాల వాదనలు పరిగణలోకి తీసుకొని నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్కు సూచించారు. కాగా, ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ -2014లోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా నీళ్లను రెండు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ ఏర్పాటైంది. కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు నీటి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేడబ్ల్యూడీటీ -2కు నేతృత్వం వహించిన జస్టిస్ బ్రజేశ్ కుమార్ ఈ ట్రిబ్యునల్కూ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టలేకపోయింది. అంతకుముందు ఒక సభ్యుడి రాజీనామాతో ఏడాది పాటు హియరింగ్లు నిర్వహించలేదు. దీంతో 2 రాష్ట్రాల జలవివాదాల విచారణ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ కాల పరిమితిని ఏడాది పొడిగించారు.
బ్రజేశ్ ట్రిబ్యునల్ కాలపరిమితి ఏడాది పొడిగింపు
- హైదరాబాద్
- June 29, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తెలంగాణలో ఏం దిద్దుదామని తిరుగుతున్నవ్?: కేసీఆర్ పై పొన్నం ఫైర్
- కాంగ్రెస్ హామీలన్నీ నెరవేరిస్తే నేను కూడా రాజీనామా చేస్త : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- Varun Tej: పిఠాపురం చేరుకున్న వరుణ్ తేజ్.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- గూగుల్తో 20 ఏళ్ల అనుబంధం..ఐ యామ్ లక్కీ అంటున్న సుందర్ పిచాయ్
- రోడ్డు మీదకు వచ్చిన.. జింకను కారుతో ఢీ కొట్టిండు
- ఇద్దరు ఫారెస్ట్ అధికారులను తొక్కి చంపిన ఏనుగు
- నడిచే నమ్మకం జగన్.. దగాకు ప్రతిరూపం చంద్రబాబు కూటమి.. పేర్ని నాని
- ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: మంత్రి శ్రీధర్ బాబు
- Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు
Most Read News
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు