పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకు మృతి

పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకు మృతి

నిజామాబాద్‌  జిల్లా బోధన్‌ పట్టణంలో పెళ్లింట విషాదం ఏర్పడింది.  వివాహమైన కొద్దిసేపటికే పెళ్లి కుమారుడు గణేష్‌ చనిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం గణేష్‌కు పెళ్లి జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. ఊరేగింపులో, బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి సంతోషంగా పెళ్లి కుమారుడు డ్యాన్స్‌ చేశాడు. అయితే  డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆయన్నుఆస్పత్రికి తరలించగా..అప్పటికే గుండేపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో  రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.