‘ మా నాన్నను ఇండియాకు రప్పించండి’

‘ మా నాన్నను ఇండియాకు రప్పించండి’

తిమ్మాపూర్, వెలుగు : సౌదీకి వెళ్లి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి చింతల రాజిరెడ్డిని స్వదేశానికి తీసుకువచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని మండలంలోని పోరండ్లకు చెందిన సంపత్ రెడ్డి ఎంపీ సంజయ్‌కుమార్‌‌ను కోరారు. బుధవారం కరీంనగర్‌‌లో ఎంపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నెల కిందట హాస్పిటల్‌లో చేర్చినట్లు చెప్పారని, మళ్లీ ఎలాంటి సమాచారం లేదన్నారు. తన తండ్రి ఇండియాకు వచ్చేలా చూడాలని వేడుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఎంపీ చెప్పినట్లు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్ తెలిపారు.