- రిషికి ప్రత్యర్థిగా సువెల్లా
- 8 వారాల పాటు ఎలక్షన్ ప్రక్రియ
- నేడు రెండో రౌండ్ సీక్రెట్ బ్యాలెట్
లండన్ : బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునక్ ఫస్ట్ బ్యాలెట్ రౌండ్లో 88 ఓట్లతో టాప్లో నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. బుధవారం నుంచి ప్రధాని ఎన్నికకు సీక్రెట్ బ్యాలెట్ రౌండ్లు మొదలైంది. ప్రధాని పదవికి 8 మంది బరిలో నిలిచారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్మన్తో పాటు ఫారెన్ సెక్రటరీ లిజ్ ట్రస్స్, చాన్స్లర్ నదీం జహావీ, ట్రేడ్ మినిస్టర్ పెన్నీ మోర్డంట్, మాజీ కేబినెట్ మినిస్టర్స్ కెమీ బడేనోచ్, జెర్మీ హంట్తో పాటు టామ్ ట్యూగెన్దట్లు ప్రధాన మంత్రి రేసులో ఉన్నారు.
రిషి సునక్కే మద్దతు
సీక్రెట్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్లో ఎవరికి అయితే తక్కువ ఓట్లు వస్తాయో.. వారు గురువారం జరిగే రెండో రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. కనీసం 30 మంది ఎంపీల మద్దతు ఉన్న వారే.. రెండో రౌండ్ బ్యాలెట్ ఓటింగ్కు ఎలిజిబుల్ అవుతారు. ఇలా మొత్తం 8 రౌండ్లు పూర్తయిన తరువాత.. ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభిస్తుందో వారే బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక అవుతారు. బుధవారం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రిషి సునక్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచి 358 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
జులై 21 నాటికి బరిలో ఇద్దరు అభ్యర్థులే
ప్రధానిగా పగ్గాలు చేపట్టబోయే పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియ 8 వారాల పాటు కొనసాగుతుంది. ఒక్కో రౌండ్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు తప్పుకుంటూ పోతారు. ఇలా జులై 21 నాటికి ఇద్దరే అభ్యర్థులు పోటీలో ఉంటారు. ఆ తరువాత.. దాదాపు 2 లక్షల మంది టోరీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు వారు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడ్తారు. తుది ఇద్దరు అభ్యర్థుల్లో రిషి కచ్చితంగా ఉంటారని స్థానిక నేతలు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త లీడర్ను సెప్టెంబర్ 5న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 7న హౌజ్ ఆఫ్ కామన్స్లో ‘ప్రైం మినిస్టర్స్ క్వొశ్చన్’ ప్రక్రియ ఉండే చాన్స్ఉంది.
ఆర్థిక వ్యవస్థకే తొలి ప్రాధాన్యత : రిషి సునక్
ఈ సందర్భంగా రిషి సునక్ ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’తో మాట్లాడారు. తాను తొలి ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ వృద్ధికే ఇస్తానని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని, మాజీ ప్రధాని మార్గరెట్ మద్దతు ఉందని చెప్పారు. తన విధానాలను సమర్థించారని గుర్తుచేశారు.
