కోటిలింగాలలోబ్రిటీష్‌‌‌‌ కాలం నాటి నాణేలు

కోటిలింగాలలోబ్రిటీష్‌‌‌‌ కాలం నాటి నాణేలు

జగిత్యాల టౌన్‌‌‌‌/వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా కోటిలింగాలలో పురాతన నాణేలు దొరికాయి. శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రకెక్కిన ఈ ప్రాంతంలో గతంలోనూ రెండు వేల ఏళ్ల నాటి నాణేలు, విగ్రహాలు బయటపడగా... తాజాగా మరోసారి బ్రిటీష్‌‌‌‌ కాలం నాటి నాణేలు దొరికాయి. కోటిలింగాల ఆలయానికి తూర్పు వైపు పెద్దవాగు తీరంలో ఓ మత్స్యకారుడికి ఆదివారం కొన్ని నాణేలు దొరికాయి.

వాటిని మాజీ సర్పంచ్‌‌‌‌ బండమీది ముత్తయ్యకు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాణేలను పరిశీలించగా వాటిపై 1911 సంవత్సరం, బ్రిటిష్‌‌‌‌ మహారాణి విక్టోరియా ఫొటో పాటు గుర్రాన్ని పరుగెత్తిస్తున్న రాజు చిత్రాలు కన్పించాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కోటిలింగాలలో తవ్వకాలు ప్రారంభించాలని పలువురు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు.