కరోనా ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ భారత పర్యటన రద్దు

కరోనా ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ భారత పర్యటన రద్దు

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన మరోసారి వాయిదా పడింది.  మొదట  ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్ కరోనా కారణంగా రాలేకపోయారు. అయితే భారత ప్రధాని మోడీతో భేటీ కోసం ఆయన ఈ నెల చివరి వారంలో భారత్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో పర్యటనను కుదించుకున్నారు. అయితే కరోనా కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది.

ఈ క్రమంలో వర్చువల్ విధానంలో భారత్, బ్రిటన్ పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు ప్రధాని మోడీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.