రాజేంద్రనగర్ లో విషాదం.. అక్కా తమ్ముడు సూసైడ్

రాజేంద్రనగర్ లో విషాదం.. అక్కా తమ్ముడు సూసైడ్

గండిపేట, వెలుగు :  అక్క, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్​గూడలోని కేశవనగర్ కాలనీలో ఉంటున్న చామంతి (26),  సోమయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. చామంతికి వరుసకు తమ్ముడయ్యే శేఖర్(25) వీరి ఇంటిపైనే రెంట్​కు ఉంటున్నాడు. 

మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో చామంతి, శేఖర్ ఉరేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్​బాడీలను ఉస్మానియాకు తరలించారు. చామంతి, శేఖర్ ఆత్మహత్యకు కారణాలు తెలియదని.. వివరాలు 
సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.