ప్రగతిభవన్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు భేటీ

ప్రగతిభవన్ లో కేసీఆర్ తో  బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు భేటీ

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో  సీఎం కేసీఆర్ ను కలిశారు. తనను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పటిష్టం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి కూడా ఉన్నారు.

ఈ నెల 2న తోట చంద్రశేఖర్  తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను  కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని ఆయనకు సూచించారు.  ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు.. తన ఆఫీసు కంటే బిజీ అయితదని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మీద పెద్ద బాధ్యత పెట్టామని.. దానికి ఆయన న్యాయం చేస్తారని కామెంట్ చేశారు.