నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్.. నాందేడ్​లో ఆఫీస్ ఓపెన్ ​చేయనున్న పార్టీ చీఫ్​ 

నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్..  నాందేడ్​లో ఆఫీస్ ఓపెన్ ​చేయనున్న పార్టీ చీఫ్​ 

నెలాఖరులో మళ్లీ మహారాష్ట్రకు కేసీఆర్
నాందేడ్​లో ఆఫీస్ ఓపెన్ ​చేయనున్న పార్టీ చీఫ్​ 

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్​ ఈ నెలాఖరులో మళ్లీ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. నాందేడ్​లో పార్టీ ఆఫీస్​ కోసం ఇప్పటికే బిల్డింగ్​కొనుగోలు చేశారు. ఆ భవనం ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే పర్యటనలో ఔరంగాబాద్​లో పార్టీ ఆఫీస్​ నిర్మాణానికి భూమిపూజ కూడా చేస్తారని తెలిసింది.

స్థానిక బీఆర్ఎస్​ నాయకులు పార్టీ ఆఫీస్​నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు చెప్తున్నారు. కేసీఆర్​ మహారాష్ట్రలో ఇప్పటికే 3 సార్లు పర్యటించారు. నాందేడ్​జిల్లా కేంద్రం, అదే జిల్లాలోని కాంధార్​లోహ, ఔరంగాబాద్​ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.