బీఆర్ఎస్  కౌన్సిలర్ సూసైడ్

బీఆర్ఎస్  కౌన్సిలర్ సూసైడ్
  • బీఆర్ఎస్ కౌన్సిలర్ సూసైడ్
  • భార్యాభర్తల మధ్య గొడవలే  కారణమని అనుమానాలు
  • మిర్యాలగూడలో ఘటన   


మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శివాజీనగర్ లో బీఆర్ఎస్ ​కౌన్సిలర్ ​సూసైడ్​ చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్  కుందూరు నాగలక్ష్మి (40) శివాని హైస్కూల్ చైర్మన్ గా కూడా పని చేస్తున్నారు. అదే స్కూల్​పై అంతస్తులో ఉంటున్నారు. భర్త శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి గురువారం రాత్రి బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత బయటకు వెళ్లిన శ్యాంసుందర్​రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. నాగలక్ష్మి కనిపించకపోవడంతో వెతికాడు. బెడ్ రూమ్ తలుపు లాక్​చేసి ఉండడం, పిలిచినా పలకకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా నాగలక్ష్మి ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దంపతుల మధ్య గొడవలే కారణమని తెలుస్తోంది.