వెలిమెల, విద్యుత్ నగర్ను తెల్లాపూర్ డివిజన్లో కలపాలి : బీఆర్ఎస్ నాయకులు

వెలిమెల, విద్యుత్ నగర్ను తెల్లాపూర్ డివిజన్లో కలపాలి : బీఆర్ఎస్ నాయకులు

రామచంద్రాపురం, వెలుగు: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్​లో భాగంగా తెల్లాపూర్​ పరిధిలోని విద్యుత్​నగర్​ను భారతీనగర్​ డివిజన్​లో, వెలిమెలను ముత్తంగి డివిజన్​లో కలిపి ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెల్లాపూర్​ మాజీ సర్పంచ్​మల్లేపల్లి సోమిరెడ్డి, మున్సిపల్​ మాజీ చైర్మన్​రాములు గౌడ్​ ఆవేదన వ్యక్తంచేశారు. వెలిమెల, విద్యుత్ నగర్​లను కొత్తగా ఏర్పడిన తెల్లాపూర్ డివిజన్​లో కలపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిపి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. 

సోమిరెడ్డి మాట్లాడుతూ..తెల్లాపూర్​కు వంద అడుగుల దూరంలో ఉన్న కాలనీని తీసుకెళ్లి పది కిలోమీటర్ల దూరంలోని సర్కిల్​లో కలపడం అధికారుల అనాలోచిత చర్యలని మండిపడ్డారు. ముత్తంగికి ఎలాంటి సంబంధం లేని వెలిమెలను కలిపి అక్కడి ప్రజల కష్టాలకు కారణం అవబోతున్నారన్నారు.

 ఈ విషయంలో జీహెచ్ఎంసీ కమీషనర్, ఇతర అధికారులను కలిశామని కాంగ్రెస్ నాయకులు సైతం ఈ ప్రాంత ప్రజల మనోవేధనను అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లచ్చిరాం, బాబ్జీ, శ్రీశైలం, నాగరాజు, రవీందర్​ రెడ్డి, కుమార్​యాదవ్, ఉమేశ్, బీఆర్ఎస్ తెల్లాపూర్ ప్రెసిడెంట్ దేవేందర్, పీఏసీఎస్​మాజీ చైర్మన్​బుచ్చిరెడ్డి, వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, అసోసియేషన్​ సభ్యులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.