- తెలంగాణ భవన్లోరిలీజ్ చేయనున్న కేసీఆర్
- అభ్యర్థులతోనూ సమావేశం.. బీఫాంలు అందజేత
- హుస్నాబాద్ నుంచి ప్రచార శంఖారావం
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఆదివారం రిలీజ్చేయనున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ అభ్యర్థులు, ఎలక్షన్ఇన్చార్జ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కోడ్ను ఎలా ఫాలో కావాలి.. తదితర అంశాలపై కేసీఆర్అభ్యర్థులకు వివరించనున్నారు. బీఫాంలు అందజేసిన అనంతరం బీఆర్ఎస్–2023 ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే మీడియా సమావేశంలో తొమ్మిదిన్నరేండ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించనున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడానికి గల కారణాలు, మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పనున్నారు. కాంగ్రెస్ఆరు గ్యారంటీలను మించి బీఆర్ఎస్మేనిఫెస్టో ఉంటుందని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఇప్పటికే పదే పదే చెప్తున్నారు. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, ఆసరా పింఛన్దారులకు మరింత ప్రయోజనం చేసేలా తమ మేనిఫెస్టో ఉండబోతోందని మీడియా చిట్చాట్లో కేటీఆర్చెప్పారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలకు ఎక్కువ మంచి చేస్తామని పేర్కొన్నారు. ఏడాదికి మూడు గ్యాస్సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, రైతులు, మహిళలు, రైతు కూలీలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కొత్త స్కీమ్లు ఉండబోతున్నాయని ప్రగతి భవన్వర్గాలు చెప్తున్నాయి. రైతుబంధు, ఆసరా పింఛన్ల పెంపుతో పాటు ఇప్పుడు అమలులో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా మేనిఫెస్టో ఉండబోతుందని తెలుస్తోంది.
నేటి నుంచి ప్రచారంలోకి కేసీఆర్
అభ్యర్థులకు బీఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత పార్టీ చీఫ్కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లోనే లంచ్చేస్తారు. తర్వాత తెలంగాణ భవన్ నుంచి హుస్నాబాద్కి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. సాయం త్రం 5 గంటలకు హుస్నాబాద్బహిరంగ సభలో పా ల్గొని రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామో కేసీఆర్ చెప్పనున్నారు. 2014, 2018 ఎన్నికల ప్రచారాన్నీ కేసీఆర్ హుస్నాబాద్నుంచే ప్రారంభించారు. రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ను కేసీఆర్కొనసాగిస్తున్నారు. తొలి ఎన్నికల ప్రచార సభను హుస్నాబాద్లో ఏర్పాటు చేశారు.
పెండింగ్ సీట్ల అభ్యర్థులకూ బీఫాంలు
ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. 115 స్థానాల్లో 114 మంది పేర్లు వెల్లడించారు. కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేయనున్నారు. మల్కాజిగిరి నుంచి సిట్టింగ్ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ప్రకటించినా తన కుమారుడు రోహిత్కు మెదక్టికెట్ ఈఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడారు. దీంతో మల్కాజిగిరి సీటును మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్రెడ్డికి ఇస్తామని ఇప్పటికే చెప్పారు. లీడర్ల మధ్య విభేదాలతో పెండింగ్లో పెట్టిన జనగామ, నర్సాపూర్టికెట్లపైనా క్లారిటీ ఇచ్చేశారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్ లోసునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారు చేశారు. ఇవి కాకుండా గోషామహల్, నాంపల్లి సీట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండు సీట్ల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులకు నేరుగా బీఫాంలు అందజేయనున్నారు. బీఫాంలు ఇచ్చే నాటికి పని తీరు మార్చుకోని ఒకరిద్దరు తప్ప ప్రకటించిన వాళ్లే క్యాండిడేట్లుగా ఉంటారని కేసీఆర్ఆగస్టు 21న చెప్పారు. మంత్రి కేటీఆర్ మీడియా చిట్చాట్లో కేసీఆర్కామెంట్స్ను ఎండార్స్చేశారు. పనితీరు మెరుగు పరుచుకోని ఇద్దరు ముగ్గురికి బీఫాంలు ఇవ్వకపోవచ్చని చెప్పారు. దీంతో బీఫాంలు దక్కని అభ్యర్థులు ఎవరు అనే చర్చ పార్టీలో సాగుతోంది.