బీఆర్ఎస్ కు ఆరు గ్యారంటీల భయం పట్టుకుంది : కోట నీలిమ

బీఆర్ఎస్ కు ఆరు గ్యారంటీల భయం పట్టుకుంది :  కోట నీలిమ

సికింద్రాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీములను చూసి బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ విమర్శించారు. గురువారం సనత్ నగర్ డివిజన్ లోని అశోక్ నగర్ కాలనీలో కాంగ్రెస్ ‘అభయ హస్తం’ పేరుతో ఆరు గ్యారంటీల పథకం గురించి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం జనాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. జనాలను మభ్యపెట్టి అవినీతి పాలన చేస్తున్నదన్నారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆమె మండిపడ్డారు. ఆమె వెంట  స్థానిక నాయకులు మోసిమ్, విజయ్,మహిళలు, యువత పాల్గొన్నారు.