బీఆర్ఎస్ అంటే బేరసారాల పార్టీ : రమేష్ నాయుడు

బీఆర్ఎస్ అంటే బేరసారాల పార్టీ : రమేష్ నాయుడు

బీఆర్ఎస్ అంటే ఏపీ ప్రజలందరు బేరసారాల పార్టీగా భావిస్తున్నారని ఏపీ బీజేపీ నేత రమేష్ నాయడు అన్నారు. బేరసారాల పార్టీలో ఏపీ నుంచి రాజకీయ నిరుద్యోగులు చేరారన్నారు. పార్టీలో చేరే ముందు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏపీ ప్రాంతాన్ని, ప్రజలను అవహేళన చేశారన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి పండుగల వరకు అందరిని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా గతంలో కేసీఆర్ మాట్లాడారని.. ఏపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని పార్టీలో చేరారని రమేష్ నాయుడు అడిగారు. ఏపీకి కేసీఆర్ రావాలంటే పోలవరంపై తన విధానాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ నీటిపై ,విద్యుత్ బకాయిలపై కేసీఆర్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల విభజనను సైతం తనకు అనుగుణంగా వాడుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి.. కేసీఆర్ రాజకీయ ఎజెండాతో వస్తున్నారని ఆరోపించారు.