సభను సీఎం తప్పుదోవ పట్టించిండు..స్పీకర్ కు బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

సభను సీఎం తప్పుదోవ పట్టించిండు..స్పీకర్ కు బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గౌరవప్రదమైన శాసనసభను సీఎం రేవంత్​రెడ్డి తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్​పార్టీ ఆరోపించింది. పార్టీకి లేని అంతర్జాతీయ కార్యదర్శి పదవిని సృష్టించి.. సంధ్యారావు అనే పేరిట నకిలీ ఎక్స్​ ఖాతాలో కేసీఆర్​ఆదేశాలతోనే శుద్ధీకరణ కార్యక్రమం చేశామని సభ సాక్షిగా రేవంత్​ అబద్ధాలు చెప్పారని, కేసీఆర్ ​ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు.

గురువారం ఈ మేరకు స్పీకర్​కు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్​రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్​ఐటీ సెల్​ వండివార్చిన నకిలీ ఎక్స్​ ఖాతాలోని పోస్టును సీఎం రేవంత్​ రెడ్డి చదివి వినిపించడం తీవ్రమైనదన్నారు. పవిత్రమైన సభలో నకిలీ పేపర్లను ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘనే అన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై అసెంబ్లీ నియమావళి సెక్షన్​168 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని చర్యలు తీసుకోవాలని కోరారు.