- జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన బీఆర్ఎస్ నేతలు
రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు పరిధిలో మూడు డివిజన్ల డీలిమిటేషన్లో సవరణలు చేయాలని పటాన్చెరు బీఆర్ఎస్కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్రెడ్డి అధికారులను కోరారు. శనివారం భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, ఇతర నియోజకవర్గ నాయకులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్కు వినతిపత్రం అందజేశారు.
ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. భౌగోళికంగా తెల్లాపూర్కు పక్కనే ఉన్న వెలిమెలను పటాన్చెరు పరిధిలో ఉన్న ముత్తంగి డివిజన్లో కలపడం అనాలోచిత చర్యని, వెంటనే వెలిమెలను తెల్లాపూర్ డివిజన్లో కలపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ నగర్ కాలనీని రెండు డివిజన్లలో కలపడం వల్ల పరిపాలనా, మౌలిక సౌకర్యాల సమస్యలు ఏర్పడుతాయని, విద్యుత్ నగర్ కాలనీని పూర్తిగా తెల్లాపూర్లో కలపాలని కోరారు.
అమీన్పూర్ సర్కిల్ పేరును రామచంద్రాపురం సర్కిల్గా మార్చాలని, సర్కిల్ కార్యాలయానికి అనువుగా జాతీయ రహదారి పక్కన పాత ఎంపీపీ ఆఫీసు అందుబాటులో ఉందని తెలిపారు. అమీన్పూర్ వరకు వెళ్లాలంటే ఇక్కడి డివిజన్ ప్రజలకు, వృద్ధులకు కష్టంగా మారుతుందని వివరించారు. ప్రజల సౌకర్యార్ధం, ప్రజాపాలన సౌలభ్యం కోసం డీలిమిటేషన్లో సవరణలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంజయ్య, కుమార్ గౌడ్, రవీందర్ రెడ్డి, పరమేశ్యాదవ్, చిన్నా, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
