
రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అప్పు చేసిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్రలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం టైగర్ రిజర్వ్ పేరుతో ఊర్లను ఖాళీ చేయించాలని కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇళ్లు, భూమి ఇస్తామని సంతకాలు తీసుకొని ఆదివాసీలను మోసం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం గిరిజనేతరులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ, బీసీ, మైనారిటీల భూములకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.